ఆశ్రమ ధర్మములు

11. ఆశ్రమ ధర్మములు

ఆశ్రమము : 
కావాలని మనస్ఫూర్తిగా ఒక దిశవైపు పెట్టే శ్రమఆధ్యాత్మిక సాధనవైపు పెట్టే శ్రమను ఆశ్రమము అందురు.

ఆశ్రమ ధర్మములు :

1. బ్రహ్మ చర్యము : సద్గురు సేవభిక్షాటనస్త్రీ సంపర్కము లేకుండుట మొదలగునవి

2. గృహస్థాశ్రమము : 
యజన యాజనఅధ్యయన అధ్యాపనదాన ప్రతి గ్రహములు అనెడి ఆరు ధర్మములు.

3. వాన ప్రస్థము : శరీర దండనముఉపవాసముమౌనము మొదలగునవి.

4. సన్న్యాసాశ్రమము :

1. సర్వ సంపదలు ఉన్నవాడైననువాటిని త్యజించితీవ్ర వైరాగ్యము కలిగిప్రాపంచిక భోగముల యెడ విరక్తుడైమోక్షాభిలాషచే ప్రేరేపింప బడినవాడు. ఇతడు స్వభావ సన్న్యాసి.

2. తినుటకు లేకనోకుటుంబమును పోషించలేకనోకలహము పెట్టుకొనియో సన్న్యసించువాడు ఆభావసన్న్యాసి.

3. దేహ సంబంధ వాసనలు విడచిదేహి సంబంధ వాసనలను కూడా విడచినవాడు. అనాదినుండి వచ్చి దృఢపడి వచ్చుచున్న ఘనరూపమైన జన్మార్జిత వాసనలను సమూలముగా నశింపజేసికొనిఆది కారణమైన మూలావిద్యను కూడా విచ్ఛిన్నము చేసుకొన్నవాడుతీవ్ర సాధనఅనుష్ఠానము చేసినవాడు ఉత్తమ సన్న్యాసి. ఉత్తమ సన్న్యాసి అనగా ముక్తుడే. కేవల ఆశ్రమ ధర్మాచరణకు ఫలము పుణ్యము.

ఆశ్రమ సాధనలు :
బ్రహ్మచర్యము : 
ఈ వ్రతమును నియమ నిష్ఠలతో నడపడముగురువును ఆశ్రయించడముఅధ్యయనము గావించుటఅగ్ని కార్యము నడపుటగురువు యొక్క అవసరమును బట్టి సంచారము చేయుటభిక్షమెత్తుట వంటి విధులను నిర్వర్తించవలెను.
         వేదాధ్యయనముగురుసేవ చేయుచుకాలక్షేప మాటలు మానుటభిక్ష గ్రహించుచు బ్రతుకుటరాగద్వేషములు లేకుండుటఉత్తమ కర్మలు చేయుటఆత్మహత్యకు పాల్పడకుండా ఉండుట.
         బ్రహ్మచర్య సమయములో గురుసన్నిధిలో శుశ్రూషలు చేయుచూ దాసునివలె ఉండవలెను. గురువు సంతుష్ఠి అయ్యేలా ప్రవర్తించవలెను. గురువు భుజించిన తర్వాతనే భుజించవలెను. గురువు నిద్రించిన తర్వాతనే నిద్రించవలెను. గురువుకంటే ముందే మేల్కొనవలెను. రుచివాసనల వంటి విషయములపైకి మనస్సును పోనీయరాదు. గురువు నిర్ణయించిన వేళలోనే వేదాధ్యయనము చేయవలెను.
              స్త్రీ గురించి మనసుతో స్మరించుటస్త్రీ విషయమై ఆసక్తితో సంభాషించుటవిషయోద్దేశముతో స్త్రీని స్పృశించుట. ఈ మూడూ ఉండకూడదు.

చతుష్పాద బ్రహ్మచర్యము :

1. ఆచార్య వచనమునందు శ్రద్ధఅనన్య భావనశుచివిద్యాగ్రహణము
2. గురువుగురుపత్నిగురుపుత్రుడు - వీరియందు పవిత్ర భావనశ్రద్ధశుశ్రూష.
3. ఆచార్యులు చేసిన ఆత్మలాభఉపకారమునకు కృతజ్ఞత భావముసంతుష్ట హృదయము.
4. ప్రాణవిత్తములచేత ఆచార్యునికి ప్రియము చేకూర్చుటసర్వవిధ శుశ్రూషలు.

1. స్థూల బ్రహ్మచర్యము : వ్యాయామ ఆసనాదులచేత శరీర శుద్ధి చేసుకొనుట

2. సూక్ష్మ బ్రహ్మ చర్యము : మనో నిర్మలతను సాధించుకొనుట

3. కారణ బ్రహ్మచర్యము : 
ఆత్మ శుద్ధికి ప్రయత్నముమూలావిద్య అనెడి మూల కారణమును నశింపజేసుకొనుట.

4. సాత్విక బ్రహ్మచర్యము : 
సాత్వికాహారము భుజించుచుఉపవాస వ్రతమునాచరించుచుభక్తి భావనను పెంపొందించుకొనుట.

5. స్వాత్మ బ్రహ్మచర్యము : స్వాత్మయందు బ్రహ్మభావనను కుదిరించుకొనుట.

6. నైష్ఠిక బ్రహ్మచర్యము : 
మనోవాక్కాయములచేత ఏ కాలమందునువిషయములందు ప్రవర్తించక బ్రహ్మమునందు సదా నిష్ఠ కలిగి యుండుట.
              పైన చెప్పబడిన దోషములను విసర్జించుట. విషయములను స్మరించుటకీర్తించుటయత్నించుటప్రవర్తించుటక్రీడించుట అను వాటిని జననము నుండి మరణము వరకు దోషములుగా గుర్తించినిర్దోషముగా నుండుట.

గార్హపత్య బ్రహ్మచర్యము : 
ఋతుకాలములో మాత్రము స్వపత్నితో ధర్మముగా ప్రవర్తించుచూమిగిలిన కాలమునంతా బ్రహ్మచర్య వ్రతమును పాటించుట.

విధుర బ్రహ్మచర్యము : భార్య మరణించిననుఉండినా గానివిరక్తుడై ఆచరించే బ్రహ్మచర్యము.

కాయక బ్రహ్మచర్యము : శరీర సంబంధమును విడచినట్టిది.

వాచిక బ్రహ్మచర్యము : వాక్కులందు విషయలంపటము లేకుండుట.

మానసిక బ్రహ్మచర్యము : విషయ సంకల్పము లేకుండుట.

బ్రహ్మచర్య మహిమ : 
పూర్ణ యశస్సుబ్రహ్మ తేజస్సుబలమువీర్యముఅపార ప్రజ్ఞశ్రీమహత్తైన యశస్సుగొప్ప పుణ్యముభగవత్ప్రీతి లభించును.

గృహస్థాశ్రమము : 
శౌచమును పాటించుటస్వపత్నిని సంతృప్తిపరచుటపంచ మహాయజ్ఞములను నిర్వర్తించుటవేదశాస్త్రములపై అభిరుచి కలిగి యుండుటదానములుహోమములు నిర్వర్తించుటదయాపరుడై యుండిఅతిథి అభ్యాగతులను ఆదరించుట. స్వభార్యయందు మాత్రమే అనురక్తి కలిగియుండుట. ఓర్పుసజ్జన సాంగత్యముసత్యముపితృకార్యములను నియమ పూర్వకముగా చేయుటనాల్గు ఆశ్రమ వాసులకు శక్త్యానుసారము సహాయమునందించుట.
              గురువు గార్కి తన శక్తికి తగిన గురుదక్షిణ సమర్పించిఆయన ఆజ్ఞకు లోబడి సమావర్తన క్రియ జరిపివివాహము చేసుకొనియజ్ఞ యాగాది కార్యములనుఅగ్ని కార్యములను చేయుచు అతిథులనుబంధువులను ఆదరించుచునిత్య సత్య వ్రతమును ఆచరించుట. స్వభార్యయందు పుత్రులను పొందివారిని యోగ్యులుగా తీర్చిదిద్దవలెను.

గృహస్థుల ప్రవృత్తి ధర్మము : 
అతికాంక్ష లేకసముచిత వృత్తి కలిగికాలమునకు తగినట్లుగా నిత్యమూ ధర్మప్రధాన భావముతో అర్థకామములను తీర్చుకొనుటయే ప్రవృత్తి ధర్మము.

గృహస్థుల నివృత్తి మార్గము : 
దాంతి కలిగిభూత కోటిపై దయ కలిగిసత్య దృష్టినివైరాగ్యమును దృఢవ్రతముగా బూనిఇంద్రియములను శాంతపరచియోగనిష్ఠుడై యుండుట నివృత్తి మార్గము. దీని లక్ష్యము మోక్షము.

పంచగతులు :

1. తపస్సు చేతయజ్ఞముల చేత దేవతలను ప్రసన్నము చేసుకొనుట.
2. తపస్సు చేత వైరాగ్య స్వభావమును పొందుట.
3. వైరాగ్యము చేత ప్రకృతిని జయించుట.
4. సన్న్యాసము చేత బ్రహ్మకర్మమును పొందుట.
5. జ్ఞానముచేత కైవల్యమును పొందుట.

వాన ప్రస్థము : 
భార్యతో కలిసి గానిఒంటరిగా గాని అడవులకు వెళ్ళి మానాభిమానములు వదలిఇంద్రియములను కట్టడిచేసిజటధారియైతాపసులు చదువుకునే శాస్త్రములను పఠించుటవారితో సద్గోష్టి జరుపుట. అడవిలో దొరికే కందమూలములుదుంపలుఆకులుపళ్ళుకాయలు మాత్రమేలభించిన వరకు సేకరించి భుజించుట. బ్రహ్మచర్యమును పాటించుట.జింక చర్మమును వస్త్రముగా ధరించుట. అతిధి పూజ గావించివారు భుజించగా మిగిలిన దానిని గ్రహించుచు తపస్సు చేసుకొనుట. భార్యతో కూడా అడవులకు వెళ్ళినవారు పై చెప్పబడినవి ఆచరించుచు ఒకరికొకరు సహాయము చేసుకొనుట. విషయములను త్రికరణ శుద్ధిగా వదలియుండుట. ఉపవాసము మొదలగు సాధనల ద్వారా శరీరమును క్షీణింపచేసికొనుచూ శరీర విసర్జన లక్ష్యముతో జీవించుచుండుట.

సన్న్యాశ్రమము : 
ఎక్కడో తలదాచుకొనుచుఆకలికి ఏదో ఒకటి తినుచుఎక్కడ రాత్రి అయితే అక్కడే పరుండుట. అగ్ని హోత్రమును మానివేయుటదేనినీ కోరకుండుటపరిగ్రహించకుండుట. ఇంద్రియములను పూర్తిగా అదుపులో పెట్టుకొనిభోగాసక్తి వీడిమెప్పుగౌరవము ఆశించక బ్రతికి యుండియూ చచ్చినవానివలె ఉండుట. కోపము లేకుండుటఎవరితోనూ సాంగత్యము లేకుండుటఓర్పుగాలేమితో ఉండుట. ఆర్జవము కలిగి యుండుట. శుచిగా నుండుట. శాంతాత్ముడైన పిమ్మట సన్న్యాసము స్వీకరించ వలెను. సన్న్యాసము బలవంతముగా గానితొందరపాటుతో గాని సమాజము కుటుంబముపై అలిగి గాని తీసుకొనకూడదు. విరక్తి వైరాగ్యములు కలిగిన తరువాతనే తీసుకొనవలెను.
         ఆత్మలోనే అగ్నిని ఆరోపించుకొని యజ్ఞము చేయవలెను. మిత్రత్వ శత్రుత్వములకు దూరముగా ఉండవలెను. తలబోడి చేసుకొనవలెను. స్థిర నివాసము కూడదు. చెట్టు మొదలే నివాసము. కపాలము చేతబూని భిక్ష ఎత్తుకొనవలెను. ఏకాకిగా ఉండవలెను. అరిషడ్వర్గముసుఖదుఃఖములు ఉండకూడదు. నిందా స్తుతులను పట్టించుకొనకూడదు. ఎవరితోనూ మాట్లాడరాదు. అంతటా తానే ఉన్నట్లుగా భావించవలెను. ఏది దొరికితే అదే తినవలెను. ఏదో ఒకటి ఒంటికి కట్టుకొనవలెను. జనసమూహములకు దూరముగా పోవలెను. వారిని పామును చూచినట్లుగా చూచి ప్రక్కకు తొలగిపోవలెను. స్త్రీ తనను చూచిన ఒక శవమును చూచినట్లు చూడవలెను.
         తన వలన ఏ ప్రాణికీ భయం కలుగకూడదు. దేనివలనను తాను భయపడకూడదు. అహింసా ధర్మమును పాటించవలెను. దేనినీ అంటక ఆకాశము వలె ఉండవలెను. అట్టివాడు అమృత హృదయుడై సర్వశరణ్యుడగును.

మధుకర వృత్తి : 
మధుపము ఏ పుష్పమును బాధించకయే మధువును ఎట్లు గ్రోలునోఅట్లే సన్న్యాసి గృహస్థులకు ఎలాంటి కష్టము కలుగకుండాభిక్షను గైకొను పద్ధతిగా చేయు వృత్తిని మధుకర వృత్తి అందురు. వంటలు పూర్తికాకముందు పోరాదు. భక్తితో నొసంగిన భిక్షను కొంచెమైననుదానితో సంతుష్టి పొందవలెను. భిక్ష ఈయజాలని వారివద్దకు వెళ్ళరాదు. భిక్ష ఈయని వారిని దూషించరాదుద్వేషించరాదు. పవిత్ర హృదయముతో మౌనియై యుండవలెను.

నిజమైన సన్న్యాసము : 
అహంకారము అనే పుత్రుడినిఅభిమానము అనే ధనమునుభ్రమ అనే అన్నదమ్ములనుమోహము అనే గృహమునుఆశ అనే భార్యను ఏ నిర్బంధము లేని ఇష్టప్రకారము వదలుట.

కుటీచక సన్న్యాసము : 
శిఖయజ్ఞోపవీతములు వీడిగంతగుడ్డ ధరించికుటీరమందుండి భిక్షాన్నమును భుజించుచూమంత్రమును జపించువాడు.

బహూదక సన్న్యాసము : 
పై వలెనే ఉండిఎనిమిది కబళముల భిక్షాన్నము మాత్రము భుజించుచూకుటీరమందుండక ఊళ్ళు తిరుగువాడు.

హంస సన్న్యాసము : జడలు ధరించిఇంతని గాకదొరికినంత భుజించు వాడుకౌపీనధారి.

పరమహంస సన్న్యాసము : 
శరీరమంతా విభూతి పూసుకొనిఐదు ఇళ్ళనుండి మాత్రము భిక్షను స్వీకరించువాడు. దీనిని తురీయ సన్న్యాసము అని కూడా అందురు.

తురీయాతీత సన్న్యాసము : 
గోవువలె నోటితో భుజించువాడు. మూడు ఇళ్ళ నుండి మాత్రమే భిక్షమెత్తువాడు. దిగంబరియైశరీర వృత్తి రహితుడై యుండువాడు.

అవధూత సన్న్యాసము : 
ఏ నియమము లేనివాడు. అజగర (కొండ చిలువ) వృత్తి అనగా దగ్గరకు వచ్చిన అన్నమునే గ్రహించి భుజించువాడుభిక్షమెత్తని వాడు. లేనిచో పస్తులుండువాడు.

పరమహంస పరివ్రాజకులు : 
సంవర్తకఆరుణిశ్వేతకేతుదుర్వాసఋభునిదాఘజడభరతరైవతదత్తాత్రేయ మొదలగువారు.

పరమహంస యొక్క విశేష దృష్టి 
ఒకే పరమాత్మ విభిన్న ఉపాధులలో విభిన్నమైన రూపనామ గుణాదులతో విభిన్న జీవాత్మలవలె ప్రతిబింబించు చున్నాడుఅయినా సర్వ దేహాదులలో అఖండముఅవిభాజ్యముఅప్రమేయముఅవ్యయము అయిన ఒకే ఆత్మ ప్రకాశించుచు ఉన్నది. నేనే అనేక దేహములలో అనేక రీతులుగా దర్శనమగుచున్నాను. నా విభూతి నాకు వినోదమగుచున్నది అనే విశేష దృష్టియే పరమహంసయొక్క విశేష దృష్టి.

యతీశ్వరుల భాగ్యము : 
1). ప్రతిబంధకము లేని భిక్షాన్నము (2) అనుకూల మఠ నివాసము (3) సత్పురుషుల సహవాసము (4) దృశ్య విషయములందు విరక్తి (5) మహా వాక్యార్థ మననము (6) వేదాంత వాక్య శ్రవణము (7) పరమాత్మ జ్ఞానము.
         ఈ చతురాశ్రమములూ మానవుని ఆయుష్కాలమును నాలుగు భాగములు చేసి క్రమ వరుసగా ఆచరింపదగును.

నిత్యసన్న్యాసి : 
ఈ దృశ్యము ఇలా ఉన్నదెందుకుఅనబడే ద్వేషము గానిఇది ఇలాగే ఉండాలి అనే ఆకాంక్ష గానిఎప్పుడైతే ఏ మాత్రమూ ఎవడికి ఉండదో వాడే నిత్య సన్న్యాసి.

వివిదిషా సన్న్యాసము : 
తత్త్వ జ్ఞానమును సంపాదించు ఇచ్ఛతో చేయబడు సన్న్యాసము. జిజ్ఞాసులు తత్త్వ జ్ఞానమును ప్రధానముగానుమనోనాశ్‌వాసనా క్షయములను రెండవ ప్రధానముగాను చేసే అభ్యాసము. ఇది విదేహముక్తికి ప్రథమ సాధనము.

విద్వత్సన్న్యాసము : 
తత్త్వ జ్ఞానము కలిగిన తరువాత చేయబడు సన్న్యాసము. జ్ఞానులు వాసనాక్షయముమనోనాశనముల సంబంధించిన సాధనలను ప్రధానముగానుతత్త్వజ్ఞాన సముపార్జనను రెండవ ప్రధానముగాను చేసే సాధన. ఇది జీవన్ముక్తికి ప్రథమ సోపానము.

యతి పంచకము : 
1. సమర్పణ 2. శరణాగతి 3. వినయము 4. వైరాగ్యము 5. ఆత్మనిష్ఠ. ఈ అయిదూ ఉన్నవాడే యతి.

యతీశ్వరుల కర్తవ్యము : 
భిక్షాన్నముప్రణవాది మంత్ర జపముస్నానముబహిరంతర శౌచముదేవతార్చనఆధ్యాత్మ జ్ఞానము.

యతులు ఎవరు ? : 
ఆత్మ జ్ఞానము కొఱకు యత్నించువారు. ప్రకృతి విలక్షణమగు ఆత్మను గూర్చి నిరంతరము చింతించువారు.

అవధూత : 
భాగవత శ్రేష్ఠులువేదవర్ణార్థములను ఎరిగినవారు. వేద వేదాంతములను బోధించువారు. (అ:వ:ధూ:త)

 : ఆశాపాశములనుండి విడుదలైనవారు. త్రికరణ శుద్ధులు. సదా బ్రహ్మానంద భరితులు.

 : వాసనా త్రయమునుండి విడువబడినవారు. దుఃఖవర్జితులు. సదా నిస్సంకల్పులు. వర్తమాన భోగములయెడ ఔదాసీనులు.

ధూ : దుమ్ము ధూళిగా నున్న శరీరేంద్రియములుండివాటి ఎరుక లేనివారు. ఆత్మ జ్ఞానమగ్నులు. ధ్యానాదులను అతిక్రమించిధ్యేయాకారులై యున్నవారు.


 : సర్వదా తత్త్వ చింతనాపరులుఅజ్ఞాన అహంకారాదులు నశించి యున్నవారు.

1. కేవల యోగులు : 
కాలత్రయ జ్ఞానము కలవారు. ఆకాశ గమనము మొదలైన చమత్కారములు జరుపువారు. అష్టసిద్ధులు కలవారు. ఈ సిద్ధులను వినియోగించుటకు ఆసక్తి కలవారు. తత్త్వజ్ఞానము దృఢముగా లేనివారు.

2. కేవల పరమహంస పరివ్రాజకులు : 
బ్రహ్మ తత్త్వమును విచారించి తెలుసుకున్నవారు. సిద్ధులుచమత్కారములు ఉండవచ్చులేకపోవచ్చు. ఉన్నప్పటికిని వినియోగించుటయందు విరక్తులుఅనాసక్తులుబ్రహ్మ జ్ఞానాతిశయము వలన ఎప్పుడైనా విధి నిషేధములను ఉల్లంఘించెదరు.

3. యోగులైన పరమహంస పరివ్రాజకులు : 
1. కేవల యోగులందున్న దోషములు. 2. కేవల పరమహంస పరివ్రాజకులందున్న దోషములు లేనివారు. ఇట్టి నిర్దోషులు సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపులు. ఏ పురుషుడు అజ్ఞానమునే కాక జ్ఞానమును కూడా విడచి కేవల స్వరూపముగా ప్రకాశించునో అతడే సాక్షాత్‌ పరబ్రహ్మ. బ్రహ్మవేత్తలందరూ సాక్షాత్‌ పరబ్రహ్మ కారు. బ్రహ్మవేత్తలు జ్ఞానమును విడచి ఉండరు. యోగియైన పరమహంస పరివ్రాజకుడిని నిత్య పూతస్థుడు అందురు. నిత్య పూతమనగా పరబ్రహ్మమేపరబ్రహ్మ స్వరూపుడని అర్ధ్థము.

అద్వైత ఆశ్రమములు : దృష్టి భేదమును బట్టి మూడు విధములు.

1. హీన దృష్ట్యాశ్రమము 
అహంకారముమమకారము అను తేడాలు లేవని అంతా బ్రహ్మస్వరూపమేనని శ్రవణము మాత్రము చేసినది.

2. మధ్య దృష్ట్యాశ్రమము : అభేదమును మననము కూడా చేసినది.

3. ఉత్తమ దృష్ట్యాశ్రమము : అభేద రూప బ్రహ్మము బుద్ధిలో ధృడమై తదనుగుణముగా జీవింపజేయునది.

ఆశ్రమనిష్ఠ : 
ఉత్తమ దృష్ట్యాశ్రమము తరువాత ఇక చలించకస్థిరమై యుండుట. నిదిధ్యాస వ్యవసాయాత్మక బుద్ధిని అందుకున్నప్పుడు కలిగేది ఆశ్రమ నిష్ఠ. పై మూడు దృష్టులు లేనిది.

పరమహంసలు : 
ఆనందాత్మను నేను అనే జ్ఞానము గలవారు పరమ హంసలు. ప్రాచీనులలో సంవర్తకుడుఅరుణిశ్వేతకేతుదుర్వాసుడుఋభువునిదాఘుడుదత్తాత్రేయులురైవకుడు మొదలగువారు పరమ హంసలు. ఇప్పుడు మనకు తెలిసినవారిలో రామకృష్ణ పరమహంస ఒకరు.


         యతీశ్వరులను పరమ హంసగా పిలిచెదరు. పరమ హంసకు భిక్ష మొదలైనవాటిలో విధిగానినియమముగాని ఉండదు.